సాహిత్య, సాంస్కృతికతకు పుట్టినిల్లు ఓరుగల్లు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వరంగల్లో ని ఏవీవీ కాలేజీలో ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు గ్రాండ్గా జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన వెంకయ్య ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏవీవీ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు చందా కాంతయ్య పలువురికి ఆదర్శమన్నారు. నాటి నిజాం పాలకులను మెప్పించి తెలుగుభాషలో ఈ విద్యాసంస్థను ఏర్పాటు చేయడం స్ఫూర్తి దాయకమన్నారు.
సాంస్కృతిక వారసత్వం, రామప్ప, వేయిస్తంబాల దేవాలయాలు వరంగల్ కే తలమానికమని అన్నారు. వారసత్వ సంపదగా వచ్చిన చెరువులను కాపాడుకోవాలన్నారు. . తెలంగాణ ప్రభుత్వం చెరువుల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్కు స్మార్ట్ సిటీ ఇచ్చామని గుర్తు చేశారు. పలు ఇంగ్లీషు రచనల్లో కాకతీయుల కళావైభనం గురించి రాశారని తెలిపారు. పలు విద్యాసంస్థలతో విద్యాకేంద్రంగా వరంగల్ విరాజిల్లుతోందన్నారు.