telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

రేపు స్వాతంత్ర్య దినోత్సవం..ఢిల్లీలో ఊపందుకున్న ఏర్పాట్లు

red fort delhi

ఎర్రకోటలో రేపు జరిగే స్వాతంత్ర్య దినోత్సవం వేడుకకు నాలుగు వేల మందికి పైగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని సమతౌల్యంతో కూడిన ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించింది. దీనిపై ఇద్దరు అతిథుల మధ్య రెండు గజాల దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది. అంతేకాదు, గౌరవ వందనం సమర్పించే సిబ్బందిని ముందు జాగ్రత్తగా క్వారంటైన్ లో ఉంచామని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

గతంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పాఠశాలల విద్యార్థులను ఆహ్వానించేవారమని, ఈసారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్సీసీ కేడెట్లను పిలిచామని రక్షణశాఖ తెలిపింది. మాస్కులు ధరించడం తప్పనిసరి చేశామని, ఎర్రకోట వద్ద కూడా పెద్ద సంఖ్యలో మాస్కులను పంపిణీకి సిద్ధంగా ఉంచామని వివరించింది.

Related posts