telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

యూసుఫ్ గూడ కృష్ణకాంత్ పార్క్ లో చేపట్టిన పనులను పూర్తి చేయండి.. కమిషనర్ రోనాల్డ్ రోస్

యూసుఫ్ గూడ కృష్ణకాంత్ పార్క్ లో ప్రజలకు, వాకర్స్ కు కనీస వసతులు కోసం మంజూరు చేసిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తో కలిసి కృష్ణకాంత్ పార్క్, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ స్థలం, ఎస్.పి.ఆర్ ప్లే గ్రౌండ్ లను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… కృష్ణకాంత్ పార్క్ లో వాకింగ్ ట్రాక్, వాష్ రూమ్, టాయిలెట్, సీవరేజ్ డ్రైన్ బాక్స్ నిర్మాణం, క్యాంటీన్ మరమ్మతులు పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా వెంగళరావు నగర్ లో చేపట్టనున్న మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన నేపథ్యంలో అంచన ప్రతిపాదనలు తయారు చేయాలి అని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రహమత్ నగర్ లో ఎస్.పి.ఆర్ ప్లే గ్రౌండ్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. కృష్ణకాంత్ పార్క్ లో ప్రతిపాదించిన పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కమిషనర్ వెంట అడిషనల్ కమిషనర్ వి.కృష్ణ, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈ ఈ రాజ్ కుమార్ కార్పొరేటర్లు దేదీప్య, సి.యన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

——————————————–

– సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీచేయడమైనది.

Related posts