telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రాష్ట్రాన్ని అవమానించేలా చంద్రబాబు ఐదేళ్ల పాలన : ఏపీ మంత్రి

vellampalli srinivas ycp

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పొట్టి శ్రీరాములును గౌరవించేలా.. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు వెల్లంపల్లి. చంద్రబాబు హయాంలో నవనిర్మాణ దీక్షలు చేశారని..రాష్ట్రాన్ని అవమానించేలా చంద్రబాబు ఐదేళ్ల పాలన ఉందని మండిపడ్డారు మంత్రి వెల్లంపల్లి. చంద్రబాబు పాలనలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పట్టించుకోలేదని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు లేఖ వల్లే రాష్ట్రం విడిపోయిందని గుర్తు చేశారు వెల్లంపల్లి. సీఎం జగన్‌ హయాంలో ఏపీ అభివృద్ధి చెందుతోందన్నారు. కాగా..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, పాల్గొన్నారు. అయితే..ఈ సందర్భంగా సీఎం జగన్‌ మట్లాడుతూ..దేశంలో ఏ రాష్ట్రమూ పడనంతగా ఆంధ్రప్రదేశ్ దగా పడిందని ఆయన పేర్కొన్నారు. సొంత రాష్ట్రం వారు..బయటి వారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వెన్నుపోటులు పొడిశారని సీఎం జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఏపీ ఎన్నో దయనీయ పరిస్థితులను చూసిందని తెలిపారు. వైసీపీ పాలనలో గ్రామాల రూపురేఖలు మార్చుస్తున్నామని పేర్కొన్నారు. కొందరు కులం పిచ్చితో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్నారు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఎందరో త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. రాష్ట్రంలో భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు.

Related posts