telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వయసొచ్చిన కూతురిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దాడుతూ… నువ్వా నీతులు చెప్పేది : రంగోలి

Rangoli

సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చేసే హంగామా అంతా ఇంతా కాదు. బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో.. ఆమె సోదరి రంగోలీ కూడా తన వివాదాస్పద వ్యాఖ్యలతో అంతే ప్రాచుర్యం దక్కించుకుంది. ఇప్పటివరకు హృతిక్ రోషన్, ఆలియా భట్, రణ్‌వీర్ సింగ్, కరణ్ జోహార్, మహేష్ భట్ వంటి ప్రముఖులను టార్గెట్ చేసిన రంగోలీ ఇప్పుడు మరోసారి మహేష్ భట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలేం జరిగిందంటే… పౌరసత్వ సవరణ బిల్లును ఉద్దేశిస్తూ మహేష్ భట్ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో.. “మీలో ప్రేమ లేకపోతే ఎన్ని దేవుళ్లను మొక్కినా, సామాజిక సేవలు చేసినా, పేదలకు సాయం చేసినా, రాజకీయాల్లోకి వచ్చినా, పుస్తకాలు రాసినా.. ఇలా ఎన్ని చేసినా మీరు చచ్చిన పాముతో సమానం. ప్రేమ లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలు రెట్టింపు అవుతూనే ఉంటాయి” అని తెలిపారు.

దీనిపై రంగోలీ చందేల్ స్పందిస్తూ “మహేష్ గారూ పుస్తకాలు చదవడం వల్ల పెద్ద విషయాలు మాత్రమే తెలుసుకోగలం. కానీ పెద్ద మనుషులం అవ్వం. వయసొచ్చిన కూతురిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దాడుతూ ఫొటో తీయించుకున్న మీరా నీతులు చెప్పేది. మనం చేసే మంచి పనులతోనే పెద్దరికం వస్తుంది. దేశం కోసం మీరేం చేశారు? ఇలా ఉదార స్వభావం ఉన్నట్లు నటిస్తే ఇక కుదరదు. మిత్రురాలా… విదేశీయులు భారతదేశంలో అడుగుపెట్టడం నచ్చని వారే మన శత్రువులు. మనం భారతమాతను రక్షించుకుందాం” అంటూ వ్యాఖ్యానించారు.

Related posts