రెండేళ్ల క్రితం ఇటలీలోని టస్కనీలో విరాట్, అనుష్కలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత వారు సోషల్ మీడియాలో ఒకే క్యాప్షన్తో పోస్ట్ చేసిన ఫొటోలు చాలా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అనుష్క, విరాట్ భూటాన్లో వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నారు. రోజూ అక్కడి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల విరాట్ తన 31వ బర్త్డే భూటాన్లో జరుపుకున్నారు. ఇంకొన్ని రోజుల పాటు విరాట్, అనుష్క భూటాన్లోనే ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అనుష్క తన తర్వాతి ప్రాజెక్ట్ను ప్రకటిస్తారు. దాదాపు ఏడాదిగా అనుష్క సిల్వర్ స్క్రీన్కు దూరంగా ఉన్నారు. కేవలం ఫొటో షూట్స్, యాడ్స్ చేస్తున్నారు. తాజాగా వోగ్ మ్యాగజైన్కు అనుష్క ఫొటో షూట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వోగ్ నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. “విరాట్ వార్డ్రోబ్ నుంచి నేను చాలా టీషర్ట్స్ తీసుకుంటూ ఉంటాను. వాటిని నేను వేసుకోవడానికి ఇష్టపడతాను. ఒక్కోసారి అతని జాకెట్స్ కూడా వేసుకుంటాను. నేను విరాట్ దుస్తులు వేసుకుంటే అతను చాలా సంతోషిస్తాడు. అయితే నేను ఫ్యాషన్ ట్రెండ్స్ని ఫాలో అవ్వను. అందుకే అందరు అమ్మాయిలు ఎంచుకునే పింక్ కలర్నే నా పెళ్లి రోజున ఎంచుకున్నాను” అని తెలిపారు.
previous post
సునీత ఆరోపణలపై స్పందించిన బన్నీ వాసు