telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం బాధాకరం : బండి సంజయ్‌

Bandi sanjay bjp

హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం ముందు ఓ వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం కలకలం రేపిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలానిగూడెంకు చెందిన శ్రీనివాస్… బండి సంజయ్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల అరెస్ట్ చేయటాన్ని నిరసిస్తూ ఆత్మహత్య పాల్పడ్డాడు. అయితే…ఈ ఘటనలో 40 శాతం శ్రీనివాస్ శరీరం కాలింది. దీంతో అప్రమత్తమైన స్ధానికులు శ్రీనివాస్ ను ఆస్పత్రికి తరిలించారు. ఆత్మహత్య పాల్పడ్డ గంగల శ్రీనివాస్ యాచారం మండల పరిధిలోని తమ్మలోని గూడం గ్రామ నివాసి. అయితే…బీజేపీ కార్యాలయం ముందు ఆత్మహత్య యత్నం చేసిన శ్రీనివాస్ ను పరామర్శించారు బీజేపీ నేతలు. ఈ ఘటన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాక్షస క్రీడ ఆడుతున్నారు అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రశ్నించే వారిపై ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేసి.. జైళ్ళకు పంపుతోంది. అయిన ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ధైర్యంగా పోరాడతాం అని తెలిపారు. తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడించే వరకు కష్టపడి పనిచేద్దాం… కార్యకర్తలు ధైర్యంగా ఉండండి అని అన్నారు. శ్రీనివాస్ ఆత్మహత్యా యత్నం బాధాకరం… పార్టీ కార్యకర్తగా చాలా కాలంగా శ్రీనివాస్ పనిచేస్తున్నాడు. అయితే ఇప్పుడు శ్రీనివాస్ మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. శ్రీనివాస్ కు 58శాతం గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు అని బండి సంజయ్ అన్నారు.

Related posts