నటిగానే కాకుండా, పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ గురించి అందరికి తెలుసు. భద్రి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మరాఠీ.. ఆనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. పవన్ తో తప్పా మరో హీరోతో సినిమా చేయలేదు. జానీ సినిమా తరువాత పవన్ ను వివాహం చేసుకున్నది. కొంతకాలం తరువాత మనస్పర్థల కారణంగా ఇద్దరు విడిపోయారు. పవన్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అటు రేణు కూడా మరో వివాహం చేసుకోవడానికి సిద్ధం అయ్యింది. ఇప్పుడు పవన్తో విడిపోయి ప్రస్తుతం రేణూ తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి పుణెలో ఉంటున్న సంగతి తెలిసిందే. రోజూ తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను రేణు ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటూనే ఉంటారు. పిల్లలు ఆద్య, అకీరాలు పవన్ రక్తం అంటూ ఇటీవల ఓ నెటిజన్ కామెంట్ చేయగా ఆయన తనదైన శైలిలో ధీటుగా బదులిచ్చింది రేణూ. అయితే తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో పవన్తో ఆద్య కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ “పిల్లలు తల్లిదండ్రుల నుండి పోలికలు లాగేసుకుంటారు. ఇదో మ్యాజిక్. నా కూతురు ఆద్య అప్పుడప్పుడు నాన్నలాగే ఉందనిపిస్తుంది. ఆద్య ఎక్కువ సార్లు వాళ్ళ నాన్నమ్మ, నాన్నలా కనిపిస్తుంది. ఆద్య నా కెమెరాకి ఫేవరేట్ పర్సన్” అంటూ తన పోస్ట్లో తెలిపింది రేణూదేశాయ్. అయితే ఇన్నాళ్ళు పవన్ మాటే ఎత్తని రేణూ సడెన్గా కూతురుతో పవన్ దిగిన ఫోటోని షేర్ చేయడంతో నెటిజన్స్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.
next post