telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

జమ్ముకాశ్మీర్‌ లో .. ఉగ్రవాదుల ఘాతుకం..

against bjp trying to apply last weapon as mp resigns

ఉగ్రవాదులు జమ్ముకాశ్మీర్‌కు చెందిన బీజేపీ నేత గుల్ మొహమ్మద్ మిర్‌ (60)ను కాల్చి చంపారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా నౌగామ్‌లో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మిర్‌ చాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయని పోలీసులు తెలిపారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించామని అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారన్నారు.

పలువురు నేతలు మిర్ హత్యను తీవ్రంగా ఖండించారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ఉగ్రవాదుల చర్య హేయమన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. 2008, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మిర్ ఓటమి పాలయ్యారు.

Related posts