telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బిజెపి లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు

kishanreddy on ap capital

కెసిఆర్ పాలనలో తెలంగాణ అప్పుల పాలు అయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఉప ఎన్నికలో దుబ్బాక ప్రజలు ఏమి తీర్పు ఇస్తారనే తెలంగాణ అంతా ఆసక్తి తో ఉన్నారని.. అమర వీరుల తెచ్చిన తెలంగాణ, కెసిఆర్ కుటుంబం వంశం అయిందని ఫైర్ అయ్యారు.దళితున్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడని..కానీ రెండు సార్లు కెసిఆరే ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. బిజెపి లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని..కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి బిజెపి సపోర్ట్ తో తెలంగాణ తెచ్చుకున్నామని తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వడం లేదు కానీ కెసిఆర్ మాత్రం తన కుటుంబానికి మాత్రమే పదవులు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. దుబ్బాక ప్రజలకు మంచి నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చిందన్నారు. TRS కు షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చే అవకాశం మీకు వచ్చింది ఆలోచించండి..బిజెపి పువ్వు గుర్తు కు ఓటు వేయాలని కోరారు. కెసిఆర్ సీఎం అయిన తర్వాత పావలా వడ్డీ మహిళలకు ఇవ్వడం లేదని..రైతులకు పావలా వడ్డీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని ఓట్లు వేసుకున్నాడని..కానీ ఇవ్వడం లేదన్నారు. కేజీ బియ్యం కు 30 రూపాయలు కేంద్రం లో మోడీ ఇస్తున్నారని..కెసిఆర్ ఇచ్చేది 2 రూపాయలే మాత్రమేన్నారు

Related posts