telugu navyamedia
తెలంగాణ వార్తలు

మునుగోడు నిన్ను క్ష‌మించ‌దు -రాజ‌గోపాల్‌రెడ్డికి వ్య‌తిరేకంగా పోస్టర్ల కలకలం

మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం రేగింది. మునుగోడు రాజ్‌గోపాల్‌ను క్షమించదంటూ చౌటుప్పల్​లో వెలసిన పోస్టర్లు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్​టాపిక్​గా మారాయి.

22వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం 13 ఏళ్ళ న‌మ్మ‌కాన్నిఅమ్ముకున్న ద్రోహి అంటూ పోస్టర్లో విమర్శించారు. పార్టీ న‌మ్మ‌కాన్ని తెలంగాణ ఇచ్చిన పార్టీ అధినేత్రి సోనియ‌మ్మను ఈడీ వేధిస్తున్న రోజే అమిత్ షాతో బేర‌మాడిన నీచుడివి’ అంటూ గుర్తు తెలియని వ్యక్తులు గోడపత్రికలు ముద్రించి పట్టణంలో అతికించారు .

రాత్రికి రాత్రే వెలిసిన ఈ పోస్టర్ల గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ పోస్ట‌ర్లు న‌ల్ల‌గొండ జిల్లా వ్యాప్తంగా వెలిశాయి. ఇతర పార్టీల నేతలే ఇలా పోస్టర్లు వేసి ఉంటారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

మరోవైపు ఈనెల 21న అమిత్ షా సమక్షంలో భారీ సభ ఏర్పాటు చేసి భాజపా తీర్థం పుచ్చుకునేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారు.

ఈ మేరకు భాజపా నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రతి 3 గ్రామాలకు ఓ సీనియర్ నేతను ఇంఛార్జ్​గా నియమించి ఉప ఎన్నిక సన్నాహాలు ప్రారంభించారు.

Related posts