telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేసీఆర్ భుజాలపై ఒవైసీ…

dk aruna bjp

డీకే అరుణ గ్రేటర్ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడారు. ఎంఐఎం, టిఆర్ఎస్ నేతలు మాకు పొత్తులేదని మాట్లాడుతున్నారు… ప్రజల చెవిలో పువ్వులు పెట్టుకున్నారు అనుకుంటున్నారా..? ఎంఐఎంకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఫ్రెండ్లి పార్టీ అని ఇప్పుడు ఎన్నికలు వచ్చే సరికి పొత్తు లేదని అంటున్నారని డీకే అరుణ ఆరోపించారు. నేను గొప్ప హిందువుని అని మాట్లాడే కేసీఆర్ భైంసా సంఘటన పై ఎందుకు స్పందించలేదు.. రెండు భుజాలపై ఒవైసి సోదరులను కూర్చోబెట్టుకున్నాడు. ఓట్ల కోసమే ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని ముస్లింలను మోసం చేస్తున్న మోసగాడు కేసీఆర్, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీతో దోస్తాని చేసే ఎంఐఎం ఎందుకు పాతబస్తీ అభివృద్ధి చేయలేదన్నారు డీకే అరుణ. కేసీఆర్ మేనిఫెస్టో కొత్త సీసాలో పాత సారల ఉంది. ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను కలవరు.. ఎమ్మెల్యేలు ప్రజలను కలవరు, మరి ప్రజా సమస్యలు ఎవరు పట్టించుకోవాలన్నారు.

మన నగరం, మన పార్టీ, మన పాలన అంట.. మన అనే స్లోగన్ అసలు వారికి షూట్ కాదు..నా పాలన , నా పార్టీ అని అంటే బాగుంటుంది. ఈ మాటలతోనే ప్రజలను మోసం చేసాడు. అందరి హైద్రాబాద్ కావాలని ప్రజలు అనుకుంటున్నారు. అందుకే బీజేపీకి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. హైటెక్ మాటలతో హైటెక్ షో కేస్ ల తయారు అయ్యాడు కేటీఆర్.. 10 వేలు పంచాకే ఎన్నికలు పెట్టేది ఉంటివి.. ఎందుకు ఎన్నికలు పెట్టావు.. ఇచ్చేందుకు డబ్బులు లేవు కాబట్టే ఇలా చేశారు. తండ్రి కొడుకులు ఇంటర్నేషనల్ దొంగలుగా మారారు అంటూ డీకే అరుణ ఫైర్ అయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల అభివృద్ధి పై చర్చకు సిద్ధమేనా కేటీఆర్.. హైదరాబాద్ కి పేరు మీరేమి తీసుకురాలేదు ఉద్ధరించింది ఏమి లేదు.. పాత నగరంలాగా హైదరాబాద్ మొత్తం కాకుండా బీజేపీకి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రగల్భాలు పలుకుతున్న సీఎంకి గ్రేటర్ ప్రజలు బుద్ది చెప్పేందుకు రెడీ ఉన్నారన్నారు.

Related posts