telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సాంకేతిక

షావోమి .. స్మార్టర్‌ లివింగ్‌ ఈవెంట్‌ .. 65 అంగుళాల టీవీ..అదో ప్రత్యేకం..

xiaomi smart living launch 65" tv

నేడు షావోమి భారతదేశంలో స్మార్టర్‌ లివింగ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇందులో భాగంగా పలు ఉత్పత్తులను లాంచ్‌ చేసింది. వీటిలో 65 అంగుళాల ఎంఐ టీవీ, ఎంఐ బ్యాండ్‌ 4, మొదటిసారిగా లాంచ్‌ చేస్తున్న వాటర్‌ ప్యూరిఫయర్‌ ఉన్నాయి. విడుదల చేసిన 65 అంగుళాల ఎంఐ టీవీ ఇప్పటిదాకా షావోమి భారతదేశంలో విడుదల చేసిన టీవీలన్నింటి కంటే అతి పెద్దది. ఈ షావోమి స్మార్టర్‌ లివింగ్‌ 2020 కార్యక్రమం కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షప్రసారమైంది. అలాగే సంస్థకు చెందిన అధికారిక సామాజిక మాధ్యమాల్లో, యూట్యూబ్‌లోనూ ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారవమైంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది. అయితే ఎంఐ బ్యాండ్‌ 4 లాంచ్‌ అయిన అనంతరం తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని అమెజాన్‌ ప్రకటించింది. ఇప్పటికే చైనాలో లాంచ్‌ అయ్యి, అమ్మకాలు జరుగుతున్న ఉత్పత్తులే నేడు భారతదేశానికి వస్తున్నాయని టెక్‌ నిపుణులు అంటున్నారు.

లాంచ్‌ అయిన 65 అంగుళాల ఎంఐ టీవీ విషయానికి వస్తే.. ఇప్పటివరకు భారతదేశంలో లాంచ్‌ అయిన అన్ని ఎంఐ టీవీల కంటే ఇది అతి పెద్దది. ఇది కూడా 4k ఎల్‌ఈడీ ప్యానెల్‌తోనే మార్కెట్లోకి రానుంది. ఈ సంవత్సరంలో షావోమి ఇప్పటికే 55 అంగుళాల ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4k ప్రోను విడుదల చేసింది. తాజాగా విడుదలైన టీవీ నెట్‌ ఫ్లిక్స్‌ సపోర్ట్‌తో ఉందని షావోమి తెలిపింది. అలాగే ఇప్పటికే మార్కెట్లో ఉన్న మిగతా టీవీలకు కూడా నెట్‌ఫ్లిక్స్‌ సపోర్ట్‌ అందిస్తామని ప్రకటించింది. అయితే ఏయే టీవీలకు నెట్‌ ఫ్లిక్స్‌ అందుబాటులోకి రానుందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఎంఐ బ్యాండ్‌ 3కి తర్వాత వెర్షన్‌గా ఎంఐ బ్యాండ్‌ 4ను షావోమి మార్కెట్లోకి తీసుకురానుంది. చైనాలో అందుబాటులో ఉన్న ఎంఐ బ్యాండే భారతదేశానికి వచ్చిందని టెక్‌ నిపుణులు అంచనా. ఈ బ్యాండ్‌ కలర్డ్‌ అమోలెడ్‌ (AMOLED) డిస్‌ప్లేతో మార్కెట్లోకి రానుంది.

దీని డిస్‌ ప్లే సైజ్‌ 0.95 అంగుళాలుగా ఉండనుంది. 2.5 గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో, 120×240 పిక్సెల్‌ ఫీచర్లు కూడా ఈ బ్యాండ్‌లో ఉన్నాయి. మీ ఫోన్‌కు వచ్చే టెక్స్ట్‌ మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ను మీరు మీ బ్యాండ్‌లోనే చూసుకోవచ్చు. మ్యూజిక్‌ ప్లే చేసుకోవడం, స్టాక్‌, వాతావరణ అప్‌ డేట్లు తెలుసుకోవడం వంటివి ఒక్క క్లిక్‌తో చేయవచ్చు. ఎంఐ బ్యాండ్‌ కలర్డ్‌ డిస్‌ప్లేతో భారత మార్కెట్లోకి రావడం ఇదే ప్రథమం. అయితే ఇప్పటికే ఎంఐ బ్యాండ్‌4 ధర మార్కెట్లోకి లీకైంది. రూ.2,499 గా దీని ధర ఉండనుందని సమాచారం. భారతదేశంలో తమ సంస్థ నుంచి తొలి వాటర్‌ ప్యూరిఫయర్‌ని లాంచ్‌ చేశామని మాత్రమే షావోమి వెల్లడించింది. దీనికి సంబంధించి మిగతా వివరాలు ఇంకా తెలియరాలేదు.

Related posts