ఏపీ సీఎం జగన్పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజా రాజధానికి పైసా ఖర్చులేకుండా 34 వేల ఎకరాలిచ్చిన 29 వేల రైతు కుటుంబాలను ముంచారని మండిపడ్డారు. ఎన్నికల ముందు తాడేపల్లి రాజప్రసాదం కట్టి నమ్మించారని దుయ్యబట్టారు విశాఖలో భూములు లాక్కుంటున్నారన్నారు.
రాజధాని మార్పుమీద ఎన్నికలకు వెళ్లి ప్రజలతీర్పు అడిగే ధైర్యంఉందా అని ప్రశ్నించారు. రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలను దేవినేని పోస్ట్ చేశారు.
లోకేశ్ నేరుగా మాట్లాడలేరు… ట్విట్టర్లో ఏదో ఒకటి చెబుతారు: బొత్స