telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఉరిశిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు: కిషన్ రెడ్డి

Kishan Reddy

ప్రియాంక హత్య కేసులో నేరస్తులకు ఉరిశిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రియాంక కుటుంబసభ్యలను కిషన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక హత్య దేశ ప్రజలందరినీ కదలించిందని అన్నారు. అమ్మాయి కనిపించగానే కామాంధులు దారుణాలకు ఒడిగట్టడం సమాజానికి ఒక సవాల్ గా మారిందని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలను తీసుకొంటామని చెప్పారు.

ఇలాంటి కేసుల్లో శిక్షలు తొందరగా పడేలా చట్టాలను మార్చబోతున్నామని తెలిపారు. ఐపీసీ, సీఆర్పీసీలను మార్చుతామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర పోలీసు అధికారులతో కేంద్ర హోంశాఖ అధికారులు మాట్లాడారని తెలిపారు. తమ పీఎస్ పరిధిలోకి ఈ కేసు రాదు అని పోలీసులు చెప్పకుండా ఉండే విధంగా మార్పులు తీసుకొస్తామని చెప్పారు. ప్రియాంక హత్య నేపథ్యంలో ప్రజలంతా చాలా ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.

Related posts