telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కార్పొరేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం కొరడా

Etala Rajender

కరోనా రోగుల పట్ల కార్పొరేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝళిపించేందుకు సిద్దమైంది. కరోనా చికిత్సకు అత్యధిక ఫీజులు వసూలు చేయడంతోపాటు మృతదేహాల అప్పగింత విషయంలో ఇబ్బుందులకు గురిచేస్తున్న ఆసుపత్రుల అనుమతుల్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఇలాంటి ఫిర్యాదులు వస్తున్న ఆసుపత్రులుపై ఆకస్మిక దాడులు నిర్వహించి రికార్డులు పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనుంది.

ప్రైవేట్ ఆసుపత్రులపై దాడులకు సంబంధించి ఇప్పటికే కొన్ని బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. రెండుమూడు రోజుల్లో ఇవి ఆసుపత్రులపై దాడులు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఓ ఆసుపత్రిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఆసుపత్రి యాజమాన్యం లక్షల ఫీజు చెల్లించాలంటూ పట్టుబట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఈటల కార్పొరేట్ ఆసుపత్రుల తీరుపై మండిపడ్డారు.

Related posts