telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఈ ఎన్నికల్లో నేరగాళ్లతో మన పోరాటం: చంద్రబాబు

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నేరగాళ్లతో మన పోరాటం చేస్తున్నామని, వైసీపీవి నేర రాజకీయాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సైబర్ క్రైమ్ నేరస్తులంతా కుమ్మక్కై ఓట్లు తొలగించే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీలో కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు జరుగుతున్నాయని చంద్రబాబు అన్నారు. విశాఖకు మోదీ వస్తే నిలదీసే ధైర్యం వైసీపీకి లేదా.. అని చంద్రబాబు ప్రశ్నించారు.

అలాగే నిజాయతీపరులంతా టీడీపీలో చేరుతున్నారని తెలిపారు. దశాబ్దాల వైరం వీడి టీడీపీకి సంఘీభావం తెలుపుతున్నారని, కర్నూలులో కోట్ల, కేఈ కుటుంబాలే ఇందుకు రుజువు అన్నారు. అలాగే విజయనగరంలో బొబ్బిలి, గజపతిరాజులే సాక్ష్యం అని, కురుపాంలో వైరం వీడి టీడీపీతో ఏకమయ్యారని వెల్లడించారు. కడపలో వర్గాలన్నీ ఏకమై టీడీపీతో కలిశారని, వర్గాలకతీతంగా టీడీపీకి మద్దతివ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Related posts