telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణ ఐపీఎస్ అధికారికి కరోనా

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే వివిధ శాఖల అధికారులు కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే తాజాగా హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర కరోనా నిర్దారణ అయింది. స్టీఫెన్ రవీంద్ర సోమవారం కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ అని ఇవాళ రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ల సూచన మేరకు ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు.

స్టీఫెన్ రవీంద్రకు కరోనా పాజిటివ్ అని తెలియడంతో ఆయనను గతం వారం రోజుల్లో కలిసినవారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. స్టీఫెన్ రవీంద్ర గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా వ్యవహరించారు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా స్టీఫెన్ రవీంద్రను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Related posts