telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జగన్ కేబినెట్ లో రోజాకు స్థానం కలిపిస్తే బాగుండేది: విజయశాంతి

Congress vijayashanti comments Modi Kcr

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కేబినెట్ లో రోజాకు స్థానం కలిపిస్తే బాగుండేదని కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. సినీ రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా వారి సేవలు వినియోగించుకుని, వారికి కూడా తగిన గుర్తింపు ఇస్తే బాగుంటుందని నేను చెప్పదలుచుకున్నాను. రాబోయే రోజుల్లో నైనా జగన్ గారు రోజా విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

కేసీఆర్ తన మంత్రివర్గంలో ఐదేళ్ల పాటు మహిళను లేకుండా చేశారని, మరో ఐదేళ్లు కూడా ఇదే ప్లాన్ తో ఉన్నారని మండిపడ్డారు. గత ఐదేళ్ల కాలంలో మహిళా మంత్రులకు స్థానం ఇవ్వకుండా కేబినెట్లో కొనసాగించిన పరిస్థితి మళ్లీ పునరావృతమవుతోందన్నారు. జగన్ తన మంత్రివర్గంలో మహిళలకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోంశాఖను కేటాయించడం మీద జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Related posts