బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ మోడీ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీ నేతలు ప్రజలను రెచ్చ గొట్టి ఓట్లు పొందాలని చూస్తున్నారని…వరంగల్ ప్రజలు మోసపోవద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలు చేస్తుందని.. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడైనా అమలవుతున్నాయా అని తెలిపారు. పేదింటి ఆడబిడ్డల పాలిట మేనమామలా ఆదుకుంటున్న మహానుభావుడు కేసీఆర్ అని…ఆరునెలల్లో కాకతీయ టెక్స్ టైల్ పార్కులో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే ఆరునెలల్లో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం మొదలు పెట్టకపోతే బీజేపీ నేతలు ముక్కు నేలకు రాయాలని హెచ్చరించారు. బీజేపీ నేతలు ఓట్ల కోసం వస్తే గ్యాస్ సిలెండర్ ముందు పెట్టి బుద్ధి చెప్పాలని… దేశంలో ఎక్కడైనా ఇంటింటికి నీళ్లు ఇచ్చారా..? అని నిలదీశారు. గోదావరి జలాలతో గొంతుతడి అర్పిన మహానుభావుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. అయితే చూడాలి మరి దీని పై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారు అనేది.
previous post
next post