ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ తన 4జీ హాట్స్పాట్ డివైజ్ ప్లాన్ను సవరించి రెండు కొత్త ప్లాన్లను ప్రకటించింది. ఇందులో ఒకటి ప్రీపెయిడ్ ప్లాన్ కాగా, రెండోది పోస్టుపెయిడ్ ప్లాన్. ఈ రెండు ప్లాన్లలోనూ ఖాతాదారులకు అదనంగా 126 జీబీ డేటాను అదనంగా ఇవ్వనున్నట్టు తెలిపింది.
ఇప్పటి వరకు 4జీ హాట్స్పాట్ డివైజ్తోపాటు రూ.399 ప్లాన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్లాన్లో నెలకు 50 జీబీ డేటా లభించేది. ఇప్పుడు ఈ ప్లాన్ను సవరించి రెండు కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, రూ.1500తో ఎయిర్టెల్ 4జీ హాట్స్పాట్ కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ప్లాన్లకు అర్హులని సంస్థ ప్రకటించింది.
ఉద్యోగం కావాలంటే పరాయి రాష్ట్రానికి వెళ్లాల్సిందేనా?: చంద్రబాబు