telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘సర్కారు వారి పాట’లో మహేష్ డ్యూయల్ రోల్ ?

SVP

పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతుండగా, జి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న విషయం విదితమే. ఇప్పుడు మహేష్ ఈ చిత్రంలో తొలిసారిగా డ్యూయల్ రోల్స్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం తొలి షెడ్యూలును ఈ ఏడాది చివర్లో అమెరికాలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. బ్యాంకు మోసాల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో బ్యాంకు ఆఫీసర్ గా ఒక క్లాస్ పాత్రలోనూ, బ్యాంకుల నుంచి అడ్డదారిలో రుణాలు ఇప్పించే బ్రోకర్ గా మాస్ పాత్రలోనూ మహేష్ నటించనున్నట్టు చెబుతున్నారు.

Related posts