తెలంగాణ పదవతరగతి పరీక్ష ఫలితాలు విడుదలైయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు గురువారం ఉదయం 11.30 గంటలకు విడుదల చేశారు.
ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 90 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.పదో తరగతి ఫలితాల్లో బాలికలదే హవా. పదో తరగతి ఫలితాల్లో బాలురు 87.61 శాతం ఉత్తీర్ణతసాధించగా.. బాలికలు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఇక, ఫలితాల్లో సిద్దిపేట జిల్లా 97 శాతంతో మొదటి స్థానంలో, హైదరాబాద్ 79 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. 15 స్కూల్స్లో ఒక్కరూ కూడా పాస్ అవలేదని మంత్రి తెలిపారు. 3007 పాఠశాలల్లో 100 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.
కాగా, ఆగస్టు 1వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి వెల్లడించారు.
ఈ ఏడాది 5,09,275 మందికి పదో తరగతి పరీక్షలు నిర్వహించగా.. వీరిలో 99 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇక, మే 23 నుంచి జూన్ ఒకటోవ తేదీ వరకు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరిగాయి.
అయితే.. కరోనా కారణంగా ఈ సారి పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహించారు అధికారులు. సిలబస్ ను సైతం 30 శాతానికి తగ్గించారు. విద్యార్థులకు ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు..
పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు bse.telangana.gov.in, bseresults.telangana.gov.in తదితర వెబ్సైట్ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.