telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన సింధు

srikanth sindhu and saina in singapoor open

ప్రపంచ బాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ లో తెలుగుతేజం పీవీ సింధుస్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె సాధించిన ఈ ఘనతపై జాతీయంగా, అంతర్జాతీయంగా సింధుపై అభినందనల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసింది. హైదరాబాద్ లోని ప్రగతిభవన్ కు వెళ్లిన సింధు సీఎం కేసీఆర్ ను కలిసి తన విజయానందాన్ని ఆయనతో పంచుకుంది.

అనంతరం సీఎం కేసీఆర్ కు సింధు రెండు బ్యాడ్మింటన్ రాకెట్లను బహూకరించింది. ఈ సందర్భంగా కేసీఆర్ మనస్ఫూర్తిగా సింధును అభినందించారు. సింధు దేశగౌరవాన్ని నిలబెట్టిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విజేతలను తయారు చేసే వేదికలా మారిందని అన్నారు. భవిష్యత్తులో సింధు పాల్గొనే టోర్నమెంట్లకు ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు.

Related posts