ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో తెలుగుతేజం పీవీ సింధుస్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె సాధించిన ఈ ఘనతపై జాతీయంగా, అంతర్జాతీయంగా సింధుపై అభినందనల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసింది. హైదరాబాద్ లోని ప్రగతిభవన్ కు వెళ్లిన సింధు సీఎం కేసీఆర్ ను కలిసి తన విజయానందాన్ని ఆయనతో పంచుకుంది.
అనంతరం సీఎం కేసీఆర్ కు సింధు రెండు బ్యాడ్మింటన్ రాకెట్లను బహూకరించింది. ఈ సందర్భంగా కేసీఆర్ మనస్ఫూర్తిగా సింధును అభినందించారు. సింధు దేశగౌరవాన్ని నిలబెట్టిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విజేతలను తయారు చేసే వేదికలా మారిందని అన్నారు. భవిష్యత్తులో సింధు పాల్గొనే టోర్నమెంట్లకు ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు.