బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్కు రానున్నారు. జూలై 2,3, 4తేదీల్లో ఈ సమావేశాల కోసం మోదీతో కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యనేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. హాజరుకానున్నారు.
2, 3, 4 తేదీల్లో ప్రధాని మోదీ మాదాపూర్ నోవాటెల్ హోటల్లో బస చేయనున్నారు. ముందుగా రాజ్భవన్లో ప్రధాని బృందం బస చేయాలని భావించింది. భద్రతా కారణాల దృష్ట్యా నోవాటెల్లో బసకు ఎస్పీజీ అనుమతిచ్చింది.
అదే సమయంలో జూలై 3వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బీజేపీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు.. ఈ నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బీజీపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న హెచ్ఐసీసీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.
ఈ క్రమంలోనే సైబరాబాద్ పోలీసులు జూలై 1 నుంచి 4వ తేదీ వరకు సీఆర్పీసీ సెక్షన్ 144ను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడాన్ని నిషేధించారు.