telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రేపు, ఎల్లుండి కుప్పంలో చంద్రబాబు.. వైసీపీ- టీడీపీ మధ్య రగడ!

chandrababu

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు తన నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయం వేడెక్కింది. ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో వైసీపీ- టీడీపీ మధ్య రగడ జరుగుతోంది. 15 రోజుల క్రితం మంత్రి పెద్దిరెడ్డి పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే పర్యటన ముగిసినప్పటికీ బ్యానర్ల తొలగింపునకు వైసీపీ శ్రేణులు అంగీకరించట్లేదు.ఎవరిదైనా పర్యటన ఉంటే ఒకటి రెండు రోజులు ప్లెక్సీలు ఏర్పాటు చేసుకుని తీసేస్తారు.

కానీ వైసీపీ నాయకులు మాత్రం పెద్దిరెడ్డి వచ్చి 15రోజులు అయినా ఇప్పటివరకూ బ్యానర్లు తొలగించలేదు. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జ్‌ మున్సిపల్ కమిషనర్‌ లక్ష్మీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అధికార పార్టీ నాయకులను బ్యానర్లు తొలగించాలని కోరారు. కమిషనర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఒక్క బ్యానర్ కూడా తొలగించకపోవడంతో టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. రేపు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏం జరుగుతుందో ఏమోనని సర్వత్రా ఉత్కంట నెలకొంది.

Related posts