డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ కోసం కోహ్లీ సేన యూకే పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన మోరె.. రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘బోర్డు ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటుందని అనుకుంటున్నా. రోహిత్ శర్మకు త్వరలోనే భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం వస్తుందనుకుంటున్నా. ధోనీ ఆధ్వర్యంలో కోహ్లీ తెలివిగల సారథిగా వృద్ధి చెందాడు. ఎంతకాలం వన్డేలు, టీ20లకు కెప్టెన్గా ఉండాలని అనుకుంటాడు? అతడు కూడా ఈ విషయమై ఆలోచిస్తాడు. ఇంగ్లండ్ పర్యటన తర్వాత దీనిపై స్పష్టత వస్తుంది. కోహ్లీ.. కెప్టెన్సీ బాధ్యతల్ని రోహిత్తో పంచుకుంటే భవిష్యత్ తరాలకు ఓ బలమైన సందేశాన్ని ఇచ్చినట్లవుతుంది. భారత్లో ఒక్కో ఫార్మాట్కు ఒక్కో కెప్టెన్ అనే పంథా సెట్ అవుతుంది. టీమిండియా భవిష్యత్ను తీర్చిదిద్దటం ఎంతో ముఖ్యమని సీనియర్ ఆటగాళ్లు భావిస్తారు. కోహ్లీ ఒక్కడే మంచి ప్రదర్శన చేస్తూ.. మూడు ఫార్మాట్లను నడిపించటం అంత సులువు కాదు. ప్రస్తుతం అతను కెప్టెన్గా జట్టును గెలిపిస్తూ బాగానే ఆడుతున్నాడు. అయితే.. ‘ఇక చాలు.. రోహిత్ ఇకపై నా బాధ్యతలు పంచుకుంటాడు’ అని ఏదో ఒక రోజు అంటాడని అనుకుంటున్నా. తప్పకుండా ఇది మన భవిష్యత్ తరాలకు ఓ మంచి బలమైన సందేశంగా మారుతుంది. ఏదేమైనప్పటికీ ఇదంతా విరాట్ మీద అధారపడి ఉంటుంది. అతడు మనిషే కదా, తన మెదడూ అలిసిపోతుంది కదా” అని మోరె చెప్పుకొచ్చాడు.
previous post
చంద్రబాబు నివాసంపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు