telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సహాయక కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు భాగస్వామ్యం కావాలి: సీఎం జగన్‌

cm jagan ycp

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

సహాయక కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని ఆయన సూచించారు. ఈ రాత్రికి 17 లక్షల క్యూసెక్కులు, రేపు ఉదయానికి 12 లక్షల క్యూసెక్కుల వరద తగ్గుతుందని తెలిసిందని జగన్ చెప్పారు. ఆ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలని ఆయన చెప్పారు.ముంపు బాధితుల కుటుంబాలకు రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని సూచించారు.

Related posts