తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ రోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. సమగ్ర సర్వే ప్రకారం 30 లక్షల మందికి ఇల్లు లేవని తేల్చారన్నారు.
హైదరాబాద్ ప్రజలను కేసీఆర్ మోసం చేసిన తీరును ఎండగడతామన్నారు. పట్నం గోస పేరుతో కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందన్నారు. చేపడతాం. ఎర్రవల్లి, చింతమడకకు ఇచ్చినట్టుగానే అన్ని గ్రామాలకు నిధులు ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు 900 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇళ్లు పేదలకు ఇవ్వడం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వం పై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసుల మాఫీ కోసం గంటా వైసీపీ వైపు మొగ్గు: మంత్రి అవంతి