ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారాన్ని లేపాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లో రాజకీయ వర్గాల్లో రాజధాని అంశం హాట్ టాపిక్ గా మారింది. రాజధాని అమరావతి నిర్మాణం అదనపు భారం తప్ప మరొకటి కాదు అనే రీతిలో బొత్స చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. టీడీపీ, ఇతర పక్షాలతో పాటు రాజధాని రైతులు కూడా మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో పర్యటించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. ఈ నెల 30న అమరావతిలో పవన్ పర్యటన ఖారైనట్టు తెలుస్తోంది. మంగళగిరి పాత బస్ స్టాండ్, నవులూరు, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, తుళ్లూరు తదితర ప్రాంతాల్లో పవన్ పర్యటన సాగనుంది. మొదట గత ప్రభుత్వం అమరావతిలో చేపట్టిన పనుల ప్రస్తుత పరిస్థితిని పవన్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత రాజధాని ప్రాంత రైతులతో పవన్ సమీక్ష నిర్వహిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.