బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచి, స్వర్ణం సాధించిన తెలుగుతేజం సింధు స్వదేశంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం గోపిచంద్ అకాడమీలో విలేకర్లతో ఆమె మాట్లాడుతూ ప్రపంచ ఛాంపియన్షిప్ గెలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎన్నో సంవత్సరాల కల నెలవేరిందని తెలిపారు. ఈ విజయం కోసం చాలా ఏళ్లు ఎదురు చూశా. విజయం కోసం నాకు ఎల్లవేళలా వెన్నంటి ఉన్న గోపి సర్కి, కిమ్ మేడమ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని చెప్పింది.
ఇక నా తదుపరి లక్ష్యం 2020-టోక్యో ఒలంపిక్స్లో స్వర్ణం. దీనికోసం చాలా పోటీ ఉంటుందని తెలుసు. కానీ, నా వ్యూహాలు నాకున్నాయి. ఒలంపిక్స్కు ముందు చాలా టోర్నీలు ఆడాలి. సూపర్ సిరీస్లు ఆడాలి. ఫిట్నెస్ను కాపాడుకుంటూ, ఎప్పటికప్పుడు తన టెక్నిక్స్ మెరుగుపరుచుకుంటాను. టాప్-10 ప్లేయర్స్ అందరికీ తమ బలాలు, బలహీనతలు తెలుసు. కావున, కొత్త వ్యూహాలతో బరిలోకి దిగాలి. ఈ సందర్భంగా అండగా నిలిచిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది.