telugu navyamedia
రాజకీయ వార్తలు

నేడు తొలి కేంద్ర కేబినెట్ సమావేశం

ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ నిన్న సాయంత్రం రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి కేంద్ర మంత్రివర్గం సమావేశం అవుతుంది17వ లోక్‌సభలో 24 మంది కేబినెట్ మంత్రులుగా, 9 మంది స్వతంత్ర హోదా మంత్రులుగా, 24 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, సదానందగౌడతో పాటు పలువురు ఎంపీలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

Related posts