telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2021 : కేకేఆర్ కు షాక్… ఢిల్లీ దే విజయం

కోల్‌కత నైట్ రైడర్స్ తో ఈరోజు జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్ లో 155 పరుగుల టార్గెట్ తో బరిలోకి వచ్చిన ఢిల్లీ జట్టులో ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ అదరగొట్టారు. అయితే ఇన్నింగ్స్ మొదటి ఓవర్ లోనే ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు బాదిన పృథ్వీ షా తర్వాత పరుగుల వరద పారించాడు. అయితే ఢిల్లీ ఓపెనర్లు ఇద్దరు కలిసి మొదటి వికెట్ కు 129 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పారు. కానీ ధావన్(46) ఔట్ అయిన తర్వాత కూడా షా(82) అర్ధశతకం పూర్తి చేసి రెచ్చిపోయాడు. కానీ గెలుపు ముంగిట అతను ఔట్ కావడంతో మార్కస్ స్టోయినిస్ చివరి బౌండరీ బాది జట్టుకు 16.3 ఓవర్లలోనే 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. దాంతో ఈ ఐపీఎల్ సీజన్ లో 5వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది ఢిల్లీ.

ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన కేకేఆర్ ఓపెనర్లలో గిల్ (43) తో రాణించగా చివర్లో ఆండ్రీ రస్సెల్(45) తో రెచ్చిపోయాడు. దాంతో నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది కేకేఆర్.

Related posts