telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

నీకు సిగ్గుంటే రాజీనామా చేసి పో..డీఎస్ కు సవాలు

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ్యులు డి. శ్రీనివాస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారం గా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత గారికి మద్దతుగా తోగుట మండలంలో మంత్రి హరీష్ రావు మరియు మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. నిజామాబాదు ఎంపీ అరవింద్ రైతులను మోసం చేసి పదవీలోకి వచ్చాడని మండిపడ్డారు. డి. శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీ వెళ్లగొడితే..సీఎం కెసిఆర్ పిలిచి రాజ్యసభకు పంపించారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు అన్నం పెట్టిన టీఆర్ఎస్ పార్టీని మోసం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. డీఎస్ టీఆర్ఎస్ లో ఉంటూ బీజేపీ పార్టీ కి సపోర్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు సిగ్గుంటే రాజ్యసభకు, టీఆర్ఎస్ కు రాజీనామా చేసి…బీజేపీ పార్టీకి వెళ్ళిపో అంటూ తీవ్రస్థాయిలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానం కోసం ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. 

Related posts