సంక్రాంతి నేపథ్యంలోప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా జనవరి నెల రాకముందే హైదరాబాద్ నుంచి వెళ్ళే రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు నిండిపోయాయి. సంక్రాంతి పర్వదినం కోసం స్వగ్రామాలకు వెళ్లేందుకు నగరవాసులు సిద్ధం అవుతుండగా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి వెళ్లే రెగ్యులర్ బస్సుల రిజర్వేషన్లు ఇప్పటికే ముగిశాయి.
పండగను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా 3,414 బస్సులతో పాటు ఏపీ నుంచి 1,526 బస్సులు నడుపుతున్నట్టు అధికారులు ప్రకటించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అటు ఏపీఎస్ఆర్టీసీ, ఇటు టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ధర 50 శాతం అధికంగా ఉన్నా, కనీసం ఆ బస్సుల్లోనైనా సొంతూరుకు వెళ్దామన్న ఉద్దేశంలో ఉన్న ప్రజలు, వాటిల్లోనైనా రిజర్వేషన్ దొరుకుతుందేమోనన్న ఆశతో ఇంటర్నెట్ ను ఆశ్రయిస్తున్నారు.