తెలంగాణ ఎమ్మెల్సీ రాములు నాయక్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తుది తీర్పు వచ్చేవరకు ఎమ్మెల్సీ ఎన్నిక జరపొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వానికి, మండలి చైర్మన్కు కోర్టు నోటీసులు ఇచ్చింది. అనర్హత పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ రాములు నాయక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రాములు నాయక్, యాదవరెడ్డికి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. వారిద్దరి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ముందు రాములు నాయక్, యాదవరెడ్డిలు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లారు. దీంతో శాసన మండలి చైర్మన్ వారిద్దరిపై అనర్హత వేటు వేశారు.
కొత్త పార్టీల ప్రభావం అంతగా ఉండదు: బాలకృష్ణ