ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఇస్మార్ట్ శంకర్” గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “ఇస్మార్ట్ శంకర్” చిత్రంలో రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించాడు . ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు సినిమాకు భారీగానే కలెక్షన్లు వచ్చాయి. మొదటి రోజు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8 కోట్లు కొల్లగొట్టింది. పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వర్మ కూడా తన శిష్యుడిని అభినందిస్తూ ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించామని టైటిల్ కూడా సూచించాడు. “ట్రిపుల్ ధిమాఖ్” పేరుతో సీక్వెల్ తెరక్కించాలని వర్మ ట్వీట్ చేశాడు. వర్మ ట్వీట్కి స్పందించిన పూరీ తాను ఆల్రెడీ “ఇస్మార్ట్ శంకర్” చిత్ర సీక్వెల్కి టైటిల్ ఫిక్స్ అయ్యానని… “డబుల్ ఇస్మార్ట్” పేరుతో ఈ చిత్రం ఉండబోతోంది. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ టైటిల్ని రిజిస్టర్ చేయించా” అని తెలిపాడు. మరి సీక్వెల్లోను రామ్ని హీరోగా ఎంచుకుంటాడా లేదంటే కొత్త హీరోతో చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.