telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ఎన్ కౌంటర్ లో ఎస్‌ఐ, నలుగురు మావోలు మృతి

army jawan kidnaped in jammu kashmir

ఛత్తీస్‌ఘడ్‌ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ఎస్‌ఐతో సహా నలుగురు మావోయిస్టులు మరణించారు. మన్పూర్ పోలీసుస్టేషను పరిధిలోని పర్ధోనీ గ్రామ సమీపంలోని అడవుల్లో సాయుధ పోలీసులు గాలిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు.

ఈ ఘటనలో ఎస్సైతోపాటు నలుగురు మావోయిస్టులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలం నుంచి ఏకే 47 రైఫిల్, రెండు 315 బోర్ రైఫిళ్లు, ఒక ఎస్ఎల్ఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతున్నట్టు రాజ్‌నందగాన్ ఏఎస్పీ జీఎన్ బాఘెల్ తెలిపారు.

Related posts