హిందూపురం నూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త పార్టీల ప్రభావం రాష్ట్రంలో అంతగా ఉండదని చెప్పారు. సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృద్ధే మళ్లీ తెలుగుదేశాన్ని అధికారంలోకి తెస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఆసుపత్రిని నిర్మించి ప్రజలకు మెరుగైన సేవలు అందించానని చెప్పారు. టీడీపీకి తప్ప ఏ పార్టీకి ఓటేసినా.. బీజేపీకి ఓటేసినట్లేనన్నారు. హత్యారాజకీయాలు వైసీపీ నేతలకు అలవాటేనని ఆయన అన్నారు. హిందూపురంలో జరిగిన అభివృద్ధే తనను మంచి మెజార్టీతో గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
previous post