telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

కరోనా భయంతో సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ ఆత్మహత్య!

New couples attack SR Nagar

కరోనా వైరస్ విజృంభించడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ మహమ్మారి అంతుచిక్కకపోవడంతో కొందరు భయంతో వణికిపోతున్నారు. సీఆర్పీఎఫ్ లో పనిచేస్తున్న ఏఎస్ఐ ఒకరు కరోనాకు భయపడి ఆత్మహత్య చేసుకోవడం పారామిలిటరీ వర్గాల్లో కలకలం రేపింది. ఈ ఘటన జమ్మూకశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో జరిగింది.

జమ్మూలోని అక్నూర్ కు చెందిన ఫతేసింగ్ సీఆర్పీఎఫ్ లో అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, విధి నిర్వహణలో ఉండగా సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణం చెందాడు. తీవ్రగాయాలతో పడివున్న ఫతేసింగ్ ను సహచరులు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆ ఏఎస్ఐ మరణించాడని డాక్టర్లు చెప్పారు. సూసైడ్ నోట్ ను పరిశీలించగా, తనకు కరోనా వస్తుందేమోనన్న భయంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొన్నాడు.

Related posts