telugu navyamedia
తెలంగాణ వార్తలు

జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరెన్‌ తో సీఎం కేసీఆర్ భేటీ

ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరెన్‌ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత బృందాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు.

KCR jharkhand Tour, kcr hemant soren

అనంత‌రం ..దేశ రాజకీయాలు, భాజపాకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేసే అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తున్నారు.

KCR jharkhand Tour, kcr hemant soren

అంతకుముందు రాంచీ విమానాశ్రయం చేరుకున్న కేసీఆర్ నేరుగా బిర్సా ముండా చౌక్‌కు చేరుకుని అక్కడ ఉన్న గిరిజ‌న ఉద్య‌మ‌కారుడు బిర్సా ముండా విగ్ర‌హానికి సీఎం కేసీఆర్ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. బిర్సా ముండా గిరిజ‌న జాతికి, ఈ దేశానికి అందించిన సేవ‌ల‌ను సీఎం కొనియాడారు

 

.

Related posts