telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

విద్యార్థినులపైకి దూసుకెళ్లిన కాలేజీ బస్సు..

Accident

హైదరాబాద్ మేడ్చల్ లో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థినుల పైకి ఓ బస్సు దూసుకెళ్లింది. ఆ బస్సు అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందినది. విద్యార్థినులు కూడా అదే కళాశాలకు చెందిన వారు కావడం గమనార్హం. ఈ ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థినులు సౌమ్య, అనూషకు గాయాలయ్యాయి. బస్సు రహదారి పక్కన ఉన్న ప్రహారీ గోడను ఢీకొట్టి నిలిచిపోయింది. మరోవైపు బస్సులో ఉన్న నలుగురు విద్యార్థినులు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Related posts