telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మిస్సింగ్ కేసుల పై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాం : సైబరాబాద్ సిపి

cp sajjanar on disa accused encounter

మిస్సింగ్ కేసులు తెలంగాణలో పెరుగుతుండటంతో వాటిపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నాం అని సైబరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. మా పరిధిలో నమోదవుతున్న కేసులన్ని వ్యక్తి గత మనస్పర్థల వల్లనే ఇంటి నుండి వెళ్లిపోతున్నారు. మైనర్లు తల్లితండ్రులతో గొడవపడి ఇంట్లో నుండి వెళ్లిపోతున్నా కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి అని తెలిపారు. మిసింగ్ కేస్ నమోదైన వెంటనే మా టీమ్ రంగంలోకి దిగుతుంది. ప్రతి కేసును మేము ఛాలెంజ్ గానే తీసుకుంటున్నాం. ఇటీవలే డాక్టర్ కేసు అయిన, గచ్చిబౌలి కేసు అయిన,పూణే అమ్మాయి కేసు అయిన వీటిని మేము స్పెషల్ టీమ్స్ తో చేధించాం అని అన్నారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా అనేది పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది అని చెప్పారు. చిన్న చిన్న కారణాలకె పిల్లలు అలిగి ఇంటి నుండి వెళ్లిపోతున్నారు భార్య భర్తల గొడవలు కూడా మరి కొన్ని మిసింగ్ కేసులకు కారణం అవుతున్నాయి. కానీ ముఖ్యంగా పిల్లలకు తల్లితండ్రుల పై గౌరవం ఉండాలి. తల్లిదండ్రులకు పిల్లలపై దృష్టి ఉంచాలి. అప్పుడే కాస్థాయిన ఈ మిసింగ్ కేసులను అరికట్టగలం అని సిపి సజ్జనార్ అన్నారు.

Related posts