telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఉభయ సభలు సోమవారానికి వాయిదా..

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశంలో ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. సంతాప తీర్మానాన్ని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టారు. 9 మంది మాజీ సభ్యులు సేవలను గుర్తు చేశారు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి. సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. శాసనమండలిలో ప్రొటెం ఛైర్మన్ హోదాలో సంతాప తీర్మానాన్ని భూపాల్ రెడ్డి చదివి వినిపించారు.

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్​, హుజూరాబాద్​ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం, కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే మేనేని సత్యనారాయణ రావు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం, మాజీ ఎమ్మెల్యేలు రాజయ్యగారి ముత్యం రెడ్డి, బొగ్గారపు సీతారామయ్య, చేకూరి కాశయ్యల మృతి పట్ల అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. సంతాప తీర్మానాల అనంతరం ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.

Related posts