తెలుగు రాష్ట్రాలో ప్రకంపనలు సృష్టించిన సైదాబాద్ ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కామాంధుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పల్లకొండ రాజు మృతిపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్టేషన్ ఘన్పూర్ రైల్వే ట్రాక్పై నిందితుడు రాజు మృతదేహం లభ్యమైనట్లు డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పినట్లు కేటీఆర్ తన ట్వీట్లో తెలిపారు.
చిన్నారిపై అత్యాచారం చేసిన ఆ మానవ మృగం చనిపోయినట్లు డీజీపీ చెప్పారన్నారు. చైత్రకు న్యాయం జరిగిందంటూ #JusticeForChaithra యాష్ట్యాగ్ను కూడా కేటీఆర్ తన ట్వీట్లో పోస్టు చేశారు.
కాగా..వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి రాజు సూసైడ్ చేసుకున్నట్లు లోకో పైలట్ పోలీసులకు తెలిపాడు. చేతి మీద వేయించుకున్న మౌనిక అనే పచ్చబొట్టు ద్వారా రాజుగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 9న హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై రాజు అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన సంగతి తెలిసిందే.