telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కరోనా మహోగ్రరూపం..కొత్తగా 1,286 మందికి పాజిటివ్‌

Corona

తెలంగాణలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన వైరస్ ఈ మధ్య పల్లెలకు పాకడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,286 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 68,946కి చేరింది. ఆసుపత్రుల్లో 18,708 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మొత్తం 563కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 391 కేసులు, రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 121 కేసులు నమోదయ్యాయి.

Related posts