టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు వేదికగా రెండు రోజులు పాటు నిర్వహించే మహానాడుకు సర్వం సిద్ధమైంది.
నగరంలో మునుపెన్నడూ లేనివిధంగా, టీడీపీ నిర్వహించే అతిపెద్ద మహోత్సవం మహానాడు కావడంతో అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో రాష్ట్ర నలుమూలలు నుంచి పార్టీ కార్యకర్తలు మహానాడుకు తరలివస్తున్నారు.
ఇక పోతే మహానాడులో పాల్గొనేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర ముఖ్య నాయకులు ఇప్పటికే ప్రకాశం జిల్లా చేరుకున్నారు.
నగరంలోని ప్రధాన వీధుల్లో ఫ్లెక్సీలు, పార్టీ జెండాలతోపాటు, ముఖ్యనేతల ఫొటోలతో ముద్రించిన ఫ్లెక్సీలు, ఎన్టీఆర్ శత జయంతి ఫ్లెక్సీలు కళక ళలాడుతున్నాయి. మహానాడు ప్రాం గణంలో ఎటు చూసినా పసుపుమయంగా ఏర్పాట్లు చేశా రు. విద్యుద్దీపాల అలంకరణ, మహానాడుకు విచ్చేసేవారికి వేర్వేరుగా గ్యాలరీలు, వీఐపీ గ్యాలరీలు, రక్తదాన శిబిరాలు, తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల గొప్పతనం చాటుతూ ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయనున్నారు.
ఇదిలా ఉండగా విచ్చేసే లక్షలాది మంది కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానుల కోసం అవసరమైన రుచికరమైన వంటకాలు ఇప్పటికే మొదలు పెట్టారు. మరోవైపు క్యాడర్ వారీగా పార్కింగ్, మెడికల్ క్యాంపు లు, మీడియాపాయింట్లతో సర్వం సిద్ధం చేశారు.