ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరినొకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటున్నారు. ఇందులో భాగంగా సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి జనసేన ధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్పై పలు ఆరోపణలు చేస్తున్న పవన్ వాటిని నిరూపిస్తే, ఆయన కాళ్లకు నమస్కరించి, పాలాభిషేకం చేస్తానని అన్నారు. జగన్ అవినీతిపై ఆధారాలు ఇస్తే, తన ఇంట్లోని జగన్ బొమ్మ తీసేసి పవన్ ఫోటోను పెట్టుకుంటానన్నారు. జగన్ చాలా గొప్ప క్యారెక్టర్ ఉన్న మనిషని, ఆయనను పవన్ ఎందుకు అపార్థం చేసుకున్నారో తెలియడం లేదని పోసాని అన్నారు.
మంత్రి లోకేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆయనకు డబ్బు, మందు, అమ్మాయిలు తప్ప మరో ధ్యాస లేదంటూ కొన్ని పాత ఫోటోలను మీడియా ముందు ప్రదర్శించారు. జగన్ గానీ ఇదే తరహాలో ఫోటోలో ఉండి, దొరికుంటే, అంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో వేసుండేవారని ఆరోపించారు. 70 ఏళ్ల వయసున్న లక్ష్మీ పార్వతిపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని, అమ్మమ్మ వయసులో ఉన్న ఆమెపై ఈ తరహా ఆరోపణలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు.
కొత్త పార్టీల ప్రభావం అంతగా ఉండదు: బాలకృష్ణ