telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో ఇవాళ నమోదైన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 629 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 8 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 45,818 మంది నమూనాలు పరీక్షించారు. నిన్న 797 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,134 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కరోనాతో మహమ్మారి కారణంగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో 14,250 మంది మృతిచెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20,56,628 మంది కరోనాబారిన పడ్డారు. మొత్తం 20,34,244 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

ఏపీ ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో కరోనాతో ప్రకాశం జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో చిత్తూరులో 104 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, గుంటూరు 91, కృష్ణా 75, నెల్లూరు 68, తూర్పుగోదావరి 65, ప్రకాశం 53, పశ్చిమగోదావరి 50, విశాఖ 49, కడప 44, శ్రీకాకుళం 16, అనంతపురం 7, కర్నూలు 4, విజయనగరం 3 కరోనా కేసులు నమోదయ్యాయి.

Related posts