‘సాక్షి’పేపర్ను టీడీపీ నేత వర్ల రామయ్య ఈ రోజు మీడియా సమావేశంలో తగులబెట్టారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఐటీ దాడులపేరుతో టీడీపీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పత్రికలో రాస్తోన్న వార్తల పట్ల తనకు విరక్తి కలిగిందని చెప్పారు.
‘ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని వాస్తవాలను ప్రచురించాలి. ఈ పత్రిక తగులబెట్టడానికి వైసీపీ నేతల వాగుడే కారణం. ఆధారాలు లేకుండా రాతలు రాస్తున్నారు. పత్రికా రంగం చాలా ప్రాధాన్యమైనది. టీడీపీ అధినేత చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేస్తే సహించమని చెప్పుకొచ్చారు. కేసుల గురించే వైసీపీ నేతలు ఢిల్లీకి వెళ్తున్నార ని వర్ల రామయ్య తెలిపారు. ప్రజలు అవకాశం ఇచ్చారు సరిగ్గా పరిపాలించండి. రహస్యంగా ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి: ఎర్రబెల్లి